డాలస్
లోని రేడియో ఖుషీ ఆధ్వర్యం లో మదర్స్ డే సందర్భం గా మహిళా సంబరాల కార్యక్రమం జరిగింది. వివిధ రంగాల్లో
కృషి చేసిన మహిళలను సన్మానించటం లో భాగం గా సాహిత్య రంగం లో మేం చేసిన కృషి ని గుర్తిస్తూ నాకు, మాలతి గారికి కూడా సన్మానం
చేశారు. సన్మాన కార్యక్రమాలు ఎలా ఉంటాయో, ఎలా జరుగుతాయో బాగానే అనుభవం వున్న మేమిద్దరం ఆ కార్యక్రమం కంటే కూడా ఆ సందర్భంగా మేమిద్దరం ఒక
పూట గడిపే అవకాశం కోసం ఎదురుచూసాము. ప్రముఖ నవలా రచయిత జి.వి. కృష్ణారావు గారు రాసిన నవల “ కీలుబొమ్మలు” చదవటం అప్పుడే మేమిద్దరం కూడా పూర్తి చేశాము కాబట్టి దాని మీద మాట్లాడాలని అప్పటికప్పుడు అనుకున్నాము. ఇదేదో పెద్ద
సాహిత్య చర్చ లాగా కాకుండా చాలా మామూలుగా మేమిద్దరం మా అభిప్రాయాలూ ఒకరితో మరొకరం పంచుకున్నాము.
దోసెలు, అరటికాయ కూర, మామిడి కాయ పప్పు, చింత చిగురు పొడి
తో మంచి రుచికరమైన భోజనం పెట్టడం తో పాటు మా
మాటలను ఆడియో, వీడియో ల రూపం లో భద్రపరిచిన మాలతి నిడదవోలు గారికి
నా కృతజ్నతలు.
కీలు
బొమ్మల పై , ఇతర సాహిత్య విషయాల పై మా ఇద్దరి సంభాషణ ఆడియో, వీడియో
ల రూపం లో ఇక్కడ వినండి, చూడండి.
ఆడియో -http://archive.org/details/InterviewWithKalpanaAndMalarhi
విడియో -
http://archive.org/details/KeeluBommaluDiscussion
రెండు లింకులకీ దారి చూపే పుట ఇదీ, -
http://archive.org/search.php?query=kalpana%20rentala