ఇటీవల మా స్నేహితులు ఇద్దరు తమ కొత్త బ్లాగులు ప్రారంభించారు. చిరకాల స్నేహితుడు , జర్నలిస్ట్, ఆంధ్రజ్యోతి పత్రికా సంపాదకుడు కె. శ్రీనివాస్ కొత్త బ్లాగ్ ఇక్కడ చూడండి.శ్రీనివాస్ పెద్దగా కవిత్వం రాయని కవి. అతని వచనం నిండా కవిత్వమే. అందుకే ప్రత్యేకంగా కవిత్వం రాయడు కాబోలు అనుకుంటాను. శ్రీనివాస్ సంపాదకీయాలు, తన కాలమ్ సంభాషణ చదివే వారికి నేనేం చెప్తున్నానో అర్ధం అవుతుంది. పత్రికా రచనల్లో కూడా తన కవిత్వాన్ని పోగొట్టుకోకుందా పదిలంగా కాపాడుకుంటున్నందుకు శ్రీనివాస్ ని అభినందించాలి.
అలాగే, మరో చిరకాల మిత్రుడు, కవి, కథకుడు వంశీకృష్ణ కూడా తన బ్లాగ్ ప్రారంభించారు. దానిని ఇక్కడ చదవచ్చు. వంశీ. కవిత్వం గురించి చెప్పటం కన్నా చదవటం మంచి అనుభూతి. అతని బ్లాగు నిజమైన కవిత్వ అభిమానులకు ఓ సెలయేరు. నా మాట తప్పు కాదని మీరు కూడా వొప్పుకుంటారు ఒక సారి చదివితే. భావుకత్వం, సున్నితత్వం , వాటికి తోడు ఒక ప్రేమానుభూతి. ఇవన్నీ వంశీ మార్క్ రచనలు.
ఇక చివరగా నేను కూడా మరో కొత్త బ్లాగ్ కి శ్రీకారం చుట్టాను. అది ఇక్కడ చదవండి.
The Road Within Has No Finish Line
-
* Zero to 26.2*
This is the story of a journey.
The great literary philosopher, Joseph Campbell, in his seminal work, "The
Hero's journey" makes the foll...
1 week ago
3 వ్యాఖ్యలు:
భద్రసింహా గారు, మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.
కల్పన రెంటాల గారు ,
నూతన సంవత్సర శుభాకాంక్షలు .
మాలా కుమార్ గారు,
మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.
Post a Comment