ఏ కూలి మనిషికీ, ఏ బీద రైతుకీ, ఏ ధనికుడూ సన్మానాలు చెయ్యడు. కులసంఘాలు అయినా, ఆ కులంలో వున్న బీదల మొహాలు చూడవు. ఏ నిరుద్యోగి అయినా, 'నేను బీదవాణ్ణి, 10 లక్షలతో నాకు సన్మానం చెయ్యండి' అంటే ఆ బీదవాడి మాట ఎవరైనా వింటారా? బీదవాళ్ళకి దాన ధర్మాలు చేస్తారు గానీ, సన్మానాలు చెయ్యరు.
నువ్వు 'పచ్చనాకు సాక్షి' కబుర్లు చెప్పిన కాలంలో, నిన్ను గోర్కీగా ఎంచుకుని ముచ్చటపడ్డాం. కానీ, అసలు గోర్కీలో ఎక్కడా మిడిసిపాటు కనపడలేదు. ఇవ్వాళ నిన్ను చూసి ఆశ్చర్యం కలుగుతోంది. ఏ మనిషి అయినా, 'నేను అందరికన్నా చాలా గొప్ప వాణ్ణి' అన్నాడంటే, అనుకున్నాడంటే, ఆ మనిషి, మొదట అల్పుడు! తర్వాత మూర్ఖుడు! నువ్వు చాలా గొప్పవాడివే అయితే, ఆ మాట నీ గురించి ఇతరులు చెప్పుకోవాలి. నిన్ను నువ్వే వర్ణించుకోవడం కాదు.
ఇంత చిన్న విషయం తెలయని ఏ మనిషి అయినా, గొప్ప వాడయ్యేది, అల్పత్వంలోనే! నువ్వు నీ సన్మానాల గురించి సంజాయిషీలు మొదలు పెట్టావెందుకు? ఈ ప్రపంచం నిండా సన్మానాలూ, బహుమానాలూ, బిరుదులూ, అవార్డులూ, తమ శ్రమతో ఏ మాత్రమూ సంబంధం లేని ధన రాసుల్ని నొల్లుకోడాలూ, అన్నీ గొప్ప సంస్కృతిగా చలామణీ అయిపోతూనే వున్నాయి. వాటి కోసం కళాకారులందరూ ఎగబడుతూనే ఉన్నారు. అందరూ చేసే పనే నువ్వూ చేశావు. చేస్తావు.
దానికి నిన్నెవరు తప్పు పట్టారు? తప్పు పడతారు? నీ సన్మానం గురించి నిన్నెవరో నిందిస్తారన్నట్టు రక రకాల దబాయింపు వాదనలు సాగించావెందుకు? 'నాకు ఉద్యోగం లేదు. బీదతనం వచ్చింది. అందుకే సన్మానాలు చేయించుకుంటున్నా' అని, నీ సన్మానాలకి ఒక కారణం చెప్పుకున్నావు. మళ్ళీ దానికే విరుద్ధంగా, 'నాకు సన్మానాలు చెయ్యవలసింది నా బీదతనం చూసి జాలితో కాదు; నా విద్వత్తుని చూసి చెయ్యాలి' అన్నావు.
నీకు సన్మానం చేసిన వాళ్ళు నీ విద్వత్తుకే చేశారు. నీ బీదతనానికి కాదు. బీదలు లోకం నిండా కుప్పతెప్పలుగా వున్నారు. ఏ కూలి మనిషికీ, ఏ బీద రైతుకీ, ఏ ధనికుడూ సన్మానాలు చెయ్యడు. కులసంఘాలు అయి నా, ఆ కులంలో వున్న బీదల మొహాలు చూడవు. ఏ నిరుద్యోగి అయినా, 'నేను బీదవాణ్ణి, 10 లక్షలతో నాకు సన్మానం చెయ్యండి' అంటే ఆ బీదవాడి మాట ఎవరైనా వింటారా? బీదవాళ్ళకి దానధర్మాలు చేస్తారు గానీ, సన్మానాలు చెయ్యరు. బీదతనాల్ని చూసి జాలిపడే వాళ్ళ దగ్గర సన్మానాలు చేసేటంతంత ధనరాసులు వుండవు. నీకు జరిగే సన్మానం, నీ బీదతనాన్ని చూసి కాదు; పుస్తకాలు రాశావు అనే కారణానికే.
'నాది బీదతనం కాబట్టి , సన్మానాలు చేయించుకుంటా' అని ఒక వేపూ, 'నా బీదతనానికి కాదు, నా విద్వత్తుకే సన్మానం జరగాలి' అని ఇంకో వేపూ- రెండూ నువ్వే అంటున్నావు. సన్మానాల్ని ఎలా సమర్థించుకోవాలో తోచని ఇబ్బందిలో పడిపోయావు. ఎందుకింత కష్టం నీకు? 'అందరూ చేసేదే నేనూ చేస్తాను' అంటే సరిపోదూ? నీకు సన్మానాలు చేసే వాళ్ళూ, చేయించే వాళ్ళూ, నీ కుల సంఘాల వాళ్ళూ, అంతమంది నీ చుట్టూ వున్నప్పుడు, నీ సన్మానాలకు ఆ కారణాలు చాలవూ? నిన్నెవరైనా, ఏమైనా అంటే, 'నాకు సన్మానాలు చేసే నా వాళ్ళు వున్నారు, మీకూ మీ వాళ్ళు వుంటే మీరూ చేయించుకోండి!' అంటే చాలదూ? అసలు ఆ మాటలు మాత్రం ఎందుకు? సన్మానం ఎందుకని ఎవరు అడిగారు నిన్ను? 'పిల్లలకి, పెద్దలకి అందరికీ పనికివచ్చే పుస్తకాలు రాశాను.
నా పుస్తకాలు చదివితే మంచి మంచి రసాలు ఊరతాయి. అంత మంచి పుస్తకాలు మీరందరూ ఎందుకు కొనరు? నా పుస్తకాలు కొంటే, ఆ డబ్బుతో నేను బతుకుతాను కదా? నా పుస్తకాలు మీరు ఎందుకు కొనరు?' అని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నావు. ఇదేం తగువు? ఇష్టమైతే కొంటారు, లేకపోతే లేదు. ఇతర రచయితల పుస్తకాల్లో మంచి రసాల పుస్తకాలన్నీ నువ్వు కొంటున్నావా? కొనకపోయినా ఎలాగో సంపాదించి చదువుతున్నావా?
నీ పుస్తకాలు కొందరైనా కొన్నారు. చదివారు. చదివిన వాళ్లందరికీ మంచి రసాలే ఊరినట్టయితే వాళ్ళు నీ పుస్తకాల్ని చాలా ప్రచారం చెయ్యాలి. వాళ్లు అలా చెయ్యటం లేదంటే, వాటి వల్ల మంచి రసాలు ఊరలేదేమో అనే ప్రశ్న నీకు రావాలి. రాలేదా?
నువ్వు నీకు తెలిన మాండలీకంలో, నీకు తెలిసిన బీద రైతు జీవితాల్ని చిత్రించావు. కొన్నిచోట్ల ముచ్చటగొలిపేలా రాశావు; కొన్నిచోట్ల చీదర పుట్టేలా రాశావు. మాండలికం ముసుగులో ఎంతెంత చీదరలకైనా రక్షణ దొరుకుతుంది. ఎవరు ఎలాంటి పుస్తకం రాసినా, దాన్ని చదివే వాళ్ళూ; కొనే వాళ్ళూ; కొనేసి చదవని వాళ్ళూ, కొనకుండా చదివే వాళ్ళూ; రకరకాలుగా వుంటారు. నువ్వూ అలాగే వుంటావు. మంచి పుస్తకాలన్నీ నువ్వు మాత్రం కొనగలవా?
'నా పుస్తకాలు మీరు కొనరు కాబట్టి నేను బీదవాణ్ణి అయ్యాను' అన్నావంటే, నీకు లోకజ్ఞానమే లేనట్టు కనపడుతోంది. పుస్తకాల మీద బతికే రచయిత లెవరూ ఈ దేశంలో లేరు. పాఠకులు, రచయితలందరి పుస్తకాలూ కొనేసి, రచయితలు పెట్టిన డబ్బు అంతా లాభాలతో సహా తిరిగి వచ్చే లాగచెయ్యాలంటే, మొదట పాఠకులందరూ బికారులై కూర్చుంటారు.
రచన అనేది ఒక 'కళే' గానీ, ఒక 'వృత్తి' కాదు. ఏ రచయిత అయినా, తన జీవనోపాధి కోసం ఏదో ఒక వృత్తి కూడా చేసుకోవలిసిందే. నీకు పత్రికలవాళ్ళు ఉద్యోగాలు ఇవ్వకపోతే, ఆ వృత్తినే మార్చుకోవాలని, మహా రచయితవి నీకు తెలీదా? ఆటోనో, టాక్సీనో నడుపుకోలేవూ? వాచ్మన్ పనిచేసుకోలేవూ? ప్రైవేట్లు చెప్పుకోలేవూ? ఒకటిరెండు స్కూళ్ళలో, టీచరు పని చేసుకోలేవూ?
గోర్కీ బండ వృత్తులు అనేకం చేశాడు. గోర్కీ అంతటి నువ్వూ అలాగే చేసుకోవాలి. లోకంలో పత్రికల వాళ్ళే ఉన్నారా ఉద్యోగాలివ్వడానికి? 'చేస్తే పత్రికలో పనే చేస్తా. ఇంకే పనీ చెయ్యను' అలా అంటావా? అలాగైతే, బీదగా బతకడానికే సిద్ధపడాలి. మాటి మాటికి బీద అరుపులు అరిచే నీకు, తాగుడు ఖర్చు ఎందుకు? బీదలు కూడా తాగుళ్ళకి అలవాటుపడతారు. కానీ వాళ్లు 'బీదలం, బీదలం' అనుకోరు. వాళ్ళ కోసం ఎవరో ఏదో చెయ్యాలనీ ఆశించరు. వాళ్లు, ఒక పని పోతే ఇంకో పని చేసుకుంటారు.
వాళ్ళ డబ్బు తోటే వాళ్ళు తాగుతారు. వాళ్ళు గొప్ప రచయితలు కారు కాబట్టి, బీదరికలో కూడా వాళ్ళు తాగుడు తప్పు చేస్తారు. కానీ, నువ్వు గొప్ప రచయితవి! నీ పుస్తకాలు మంచి రసాలు ఊరిస్తాయి! పుస్తకాల వల్ల డబ్బు రాకపోయినా, ఉద్యోగం లేకపోయినా, తాగుడు కోసం ఖర్చు పెట్టే వాడికి, లేదా ఇతరులు పోయిస్తే తాగే వాడికి, జీవితం మీద ఎంత బాధ్యత ఉన్నట్టు? మంచి రసాలు ఊరే నీ పుస్తకాల వల్ల నువ్వెంత నేర్చుకున్నట్టు?ఆ రసాలన్నీ మా కోసమేనా? నీ కోసం కాదా? పుస్తకాలు నీకు తాగుడు ఎలా నేర్పాయి?
నీ సన్మానాలకోసం డబ్బు అందించినవాళ్లకి, నీ పుస్తకాల మీద లక్ష్యం లేదని నువ్వే అంటున్నావు. నీ పుస్తకాలు నీలో ఆత్మాభిమాన రసాన్ని ఊరించలేదా? 'నేను బీదగా వున్నాను కాబట్టి, డబ్బుకోసం సన్మానాలు చేయించుకుంటా' అంటున్నావంటే, నీ వాదంలో, బీద గా వున్నందుకూ సన్మానమే; విద్వత్తు ఉన్నందుకూ సన్మానమే! చాలా తెలివైన దారి!
'ఒక్క ఎకరం వున్న తండ్రి గల వాణ్ణి కాబట్టే బీదరైతుల జీవితాల్ని బాగాచెప్పగలిగాను; ఐదెకరాల ఇంట్లో పుడితే అలాచెప్పలేకపోదును' అన్నావు. ఆ లెక్కన చూస్తే, ఇప్పుడు నువ్వు 10 లక్షల వాడివయ్యావు. ఇంకా అవుతావు కూడా. ఇక ఇప్పటి నించీ నువ్వు చెప్పగలిగే మంచి రసాల రచనలేవీ వుండవని అర్ధమేకదా? నీ వాదన ప్రకారమే, ఇక నామిని అస్తమించాడన్న మాటే కదా?
నామినీ, ఎందుకిలా నీ భుజాలు నువ్వు తడుముకుంటున్నావు? సంజాయిషీలతో మొదలుపెట్టి, దబాయింపుల్లోకి దిగిపోయావు. 'నేను ఇంత గొప్ప, అంత గొప్ప' అని మిడిసిపాటు ప్రదర్శించావు. బొత్తిగా, నిష్కారణంగా చాలా యాతన పడ్డావు.
కొంచెం వివేకం తెచ్చుకో! నీ సన్మానాల గురించి ఎవరైనా నిన్ను తప్పు పడితే, 'అందరూ చేసే పనే నేను చేశాను' నా కన్నా ముందు సన్మానాలు జరిగిన వాళ్ళందర్నీ తప్పు పట్టి, ఆ తర్వాత నన్ను తప్పు పట్టండి' అని చెప్పు, సరిపోతుంది. నువ్వు గతంలో ఎప్పుడైనా సన్మానాలకు వ్యతిరేకంగా మాట్లాడివుంటే, 'అప్పుడు బుద్ధి లేక అలా మాట్లాడాను. ఇప్పుడు బుద్ధి తెచ్చుకున్నాను' అని చెప్పు! అది ఇంకా సరిపోతుంది.
కులసంఘాల వాళ్ళ నించీ డబ్బు అందుకుని, 'వికారంగా కులసంఘా ల డబ్బు' అంటూ బడాయి మాటలు విసిరి, కులసంఘాల వాళ్ళకి ఒళ్ళు మండించకు! ఎందుకీ తుంటరి మాటలు? నీ విద్వత్తుకో, నీ బీదరికానికో, దేనికో దానికి నిన్ను స్థితిమంతుణ్ణి చేస్తోంటే, వాళ్ళకి వినయం చూపించు.
వాళ్ళకి అణగి మణిగి వుండు. చక్కగా వేద మంత్రాలతో, మంగళ వాయిద్యాలతో బాజా భజంత్రీలతో, వంది మాగధులతో ఎబికె ప్రసాద్ వంటి మహా మేధావుల ఆశీస్సులతో, బడా పారిశ్రామిక వేత్తల జ్యోతి ప్రజ్వలనాలతో, వందన సమర్పణలతో, రంగరంగ వైభవంగా సన్మానం చేయించుకో! ముచ్చటగా నెలకో సన్మానంతో నెలకో లక్ష అందుకో! ఎంతకాలం దాకా ఇస్తారో అంతకాలం దాకా అందుకో! వాళ్ళు ఇచ్చింది వాళ్ళ కష్టార్జితం కాదులే. వాళ్ళు దోచుకునే దాంట్లో నువ్వూ ఒక వాటా సంపాదించుకో.
నువ్వు ఇప్పుడు ఒక్క ఎకరం బీద రైతు కుమారుడివి కావు; బడా బడా పారిశ్రామికవేత్తల అత్యున్నత దేవస్థానం ప్రముఖుల ముద్దబిడ్డవి! ఇన్నా ళ్ళూ బీదరైతుల కథలు రాసిన నీ కలం నించి, ఇక ఇప్పటి నించి, సన్మానా లూ, ధనరాసులూ, ఎంత రుచికరమైనవో, నీ వంటి గొప్ప రచయితలకు అవి అందడం ఎంత న్యాయమో, ఎంత అభ్యుదయమో వర్ణిస్తూ నీ వాదనలతో రాబోయే నీ కొత్త రసాల రచన కోసం ఎదురు చూస్తాం నామినీ! సరేనా?
నువ్వు 'పచ్చనాకు సాక్షి' కబుర్లు చెప్పిన కాలంలో, నిన్ను గోర్కీగా ఎంచుకుని ముచ్చటపడ్డాం. కానీ, అసలు గోర్కీలో ఎక్కడా మిడిసిపాటు కనపడలేదు. ఇవ్వాళ నిన్ను చూసి ఆశ్చర్యం కలుగుతోంది. ఏ మనిషి అయినా, 'నేను అందరికన్నా చాలా గొప్ప వాణ్ణి' అన్నాడంటే, అనుకున్నాడంటే, ఆ మనిషి, మొదట అల్పుడు! తర్వాత మూర్ఖుడు! నువ్వు చాలా గొప్పవాడివే అయితే, ఆ మాట నీ గురించి ఇతరులు చెప్పుకోవాలి. నిన్ను నువ్వే వర్ణించుకోవడం కాదు.
ఇంత చిన్న విషయం తెలయని ఏ మనిషి అయినా, గొప్ప వాడయ్యేది, అల్పత్వంలోనే! నువ్వు నీ సన్మానాల గురించి సంజాయిషీలు మొదలు పెట్టావెందుకు? ఈ ప్రపంచం నిండా సన్మానాలూ, బహుమానాలూ, బిరుదులూ, అవార్డులూ, తమ శ్రమతో ఏ మాత్రమూ సంబంధం లేని ధన రాసుల్ని నొల్లుకోడాలూ, అన్నీ గొప్ప సంస్కృతిగా చలామణీ అయిపోతూనే వున్నాయి. వాటి కోసం కళాకారులందరూ ఎగబడుతూనే ఉన్నారు. అందరూ చేసే పనే నువ్వూ చేశావు. చేస్తావు.
దానికి నిన్నెవరు తప్పు పట్టారు? తప్పు పడతారు? నీ సన్మానం గురించి నిన్నెవరో నిందిస్తారన్నట్టు రక రకాల దబాయింపు వాదనలు సాగించావెందుకు? 'నాకు ఉద్యోగం లేదు. బీదతనం వచ్చింది. అందుకే సన్మానాలు చేయించుకుంటున్నా' అని, నీ సన్మానాలకి ఒక కారణం చెప్పుకున్నావు. మళ్ళీ దానికే విరుద్ధంగా, 'నాకు సన్మానాలు చెయ్యవలసింది నా బీదతనం చూసి జాలితో కాదు; నా విద్వత్తుని చూసి చెయ్యాలి' అన్నావు.
నీకు సన్మానం చేసిన వాళ్ళు నీ విద్వత్తుకే చేశారు. నీ బీదతనానికి కాదు. బీదలు లోకం నిండా కుప్పతెప్పలుగా వున్నారు. ఏ కూలి మనిషికీ, ఏ బీద రైతుకీ, ఏ ధనికుడూ సన్మానాలు చెయ్యడు. కులసంఘాలు అయి నా, ఆ కులంలో వున్న బీదల మొహాలు చూడవు. ఏ నిరుద్యోగి అయినా, 'నేను బీదవాణ్ణి, 10 లక్షలతో నాకు సన్మానం చెయ్యండి' అంటే ఆ బీదవాడి మాట ఎవరైనా వింటారా? బీదవాళ్ళకి దానధర్మాలు చేస్తారు గానీ, సన్మానాలు చెయ్యరు. బీదతనాల్ని చూసి జాలిపడే వాళ్ళ దగ్గర సన్మానాలు చేసేటంతంత ధనరాసులు వుండవు. నీకు జరిగే సన్మానం, నీ బీదతనాన్ని చూసి కాదు; పుస్తకాలు రాశావు అనే కారణానికే.
'నాది బీదతనం కాబట్టి , సన్మానాలు చేయించుకుంటా' అని ఒక వేపూ, 'నా బీదతనానికి కాదు, నా విద్వత్తుకే సన్మానం జరగాలి' అని ఇంకో వేపూ- రెండూ నువ్వే అంటున్నావు. సన్మానాల్ని ఎలా సమర్థించుకోవాలో తోచని ఇబ్బందిలో పడిపోయావు. ఎందుకింత కష్టం నీకు? 'అందరూ చేసేదే నేనూ చేస్తాను' అంటే సరిపోదూ? నీకు సన్మానాలు చేసే వాళ్ళూ, చేయించే వాళ్ళూ, నీ కుల సంఘాల వాళ్ళూ, అంతమంది నీ చుట్టూ వున్నప్పుడు, నీ సన్మానాలకు ఆ కారణాలు చాలవూ? నిన్నెవరైనా, ఏమైనా అంటే, 'నాకు సన్మానాలు చేసే నా వాళ్ళు వున్నారు, మీకూ మీ వాళ్ళు వుంటే మీరూ చేయించుకోండి!' అంటే చాలదూ? అసలు ఆ మాటలు మాత్రం ఎందుకు? సన్మానం ఎందుకని ఎవరు అడిగారు నిన్ను? 'పిల్లలకి, పెద్దలకి అందరికీ పనికివచ్చే పుస్తకాలు రాశాను.
నా పుస్తకాలు చదివితే మంచి మంచి రసాలు ఊరతాయి. అంత మంచి పుస్తకాలు మీరందరూ ఎందుకు కొనరు? నా పుస్తకాలు కొంటే, ఆ డబ్బుతో నేను బతుకుతాను కదా? నా పుస్తకాలు మీరు ఎందుకు కొనరు?' అని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నావు. ఇదేం తగువు? ఇష్టమైతే కొంటారు, లేకపోతే లేదు. ఇతర రచయితల పుస్తకాల్లో మంచి రసాల పుస్తకాలన్నీ నువ్వు కొంటున్నావా? కొనకపోయినా ఎలాగో సంపాదించి చదువుతున్నావా?
నీ పుస్తకాలు కొందరైనా కొన్నారు. చదివారు. చదివిన వాళ్లందరికీ మంచి రసాలే ఊరినట్టయితే వాళ్ళు నీ పుస్తకాల్ని చాలా ప్రచారం చెయ్యాలి. వాళ్లు అలా చెయ్యటం లేదంటే, వాటి వల్ల మంచి రసాలు ఊరలేదేమో అనే ప్రశ్న నీకు రావాలి. రాలేదా?
నువ్వు నీకు తెలిన మాండలీకంలో, నీకు తెలిసిన బీద రైతు జీవితాల్ని చిత్రించావు. కొన్నిచోట్ల ముచ్చటగొలిపేలా రాశావు; కొన్నిచోట్ల చీదర పుట్టేలా రాశావు. మాండలికం ముసుగులో ఎంతెంత చీదరలకైనా రక్షణ దొరుకుతుంది. ఎవరు ఎలాంటి పుస్తకం రాసినా, దాన్ని చదివే వాళ్ళూ; కొనే వాళ్ళూ; కొనేసి చదవని వాళ్ళూ, కొనకుండా చదివే వాళ్ళూ; రకరకాలుగా వుంటారు. నువ్వూ అలాగే వుంటావు. మంచి పుస్తకాలన్నీ నువ్వు మాత్రం కొనగలవా?
'నా పుస్తకాలు మీరు కొనరు కాబట్టి నేను బీదవాణ్ణి అయ్యాను' అన్నావంటే, నీకు లోకజ్ఞానమే లేనట్టు కనపడుతోంది. పుస్తకాల మీద బతికే రచయిత లెవరూ ఈ దేశంలో లేరు. పాఠకులు, రచయితలందరి పుస్తకాలూ కొనేసి, రచయితలు పెట్టిన డబ్బు అంతా లాభాలతో సహా తిరిగి వచ్చే లాగచెయ్యాలంటే, మొదట పాఠకులందరూ బికారులై కూర్చుంటారు.
రచన అనేది ఒక 'కళే' గానీ, ఒక 'వృత్తి' కాదు. ఏ రచయిత అయినా, తన జీవనోపాధి కోసం ఏదో ఒక వృత్తి కూడా చేసుకోవలిసిందే. నీకు పత్రికలవాళ్ళు ఉద్యోగాలు ఇవ్వకపోతే, ఆ వృత్తినే మార్చుకోవాలని, మహా రచయితవి నీకు తెలీదా? ఆటోనో, టాక్సీనో నడుపుకోలేవూ? వాచ్మన్ పనిచేసుకోలేవూ? ప్రైవేట్లు చెప్పుకోలేవూ? ఒకటిరెండు స్కూళ్ళలో, టీచరు పని చేసుకోలేవూ?
గోర్కీ బండ వృత్తులు అనేకం చేశాడు. గోర్కీ అంతటి నువ్వూ అలాగే చేసుకోవాలి. లోకంలో పత్రికల వాళ్ళే ఉన్నారా ఉద్యోగాలివ్వడానికి? 'చేస్తే పత్రికలో పనే చేస్తా. ఇంకే పనీ చెయ్యను' అలా అంటావా? అలాగైతే, బీదగా బతకడానికే సిద్ధపడాలి. మాటి మాటికి బీద అరుపులు అరిచే నీకు, తాగుడు ఖర్చు ఎందుకు? బీదలు కూడా తాగుళ్ళకి అలవాటుపడతారు. కానీ వాళ్లు 'బీదలం, బీదలం' అనుకోరు. వాళ్ళ కోసం ఎవరో ఏదో చెయ్యాలనీ ఆశించరు. వాళ్లు, ఒక పని పోతే ఇంకో పని చేసుకుంటారు.
వాళ్ళ డబ్బు తోటే వాళ్ళు తాగుతారు. వాళ్ళు గొప్ప రచయితలు కారు కాబట్టి, బీదరికలో కూడా వాళ్ళు తాగుడు తప్పు చేస్తారు. కానీ, నువ్వు గొప్ప రచయితవి! నీ పుస్తకాలు మంచి రసాలు ఊరిస్తాయి! పుస్తకాల వల్ల డబ్బు రాకపోయినా, ఉద్యోగం లేకపోయినా, తాగుడు కోసం ఖర్చు పెట్టే వాడికి, లేదా ఇతరులు పోయిస్తే తాగే వాడికి, జీవితం మీద ఎంత బాధ్యత ఉన్నట్టు? మంచి రసాలు ఊరే నీ పుస్తకాల వల్ల నువ్వెంత నేర్చుకున్నట్టు?ఆ రసాలన్నీ మా కోసమేనా? నీ కోసం కాదా? పుస్తకాలు నీకు తాగుడు ఎలా నేర్పాయి?
నీ సన్మానాలకోసం డబ్బు అందించినవాళ్లకి, నీ పుస్తకాల మీద లక్ష్యం లేదని నువ్వే అంటున్నావు. నీ పుస్తకాలు నీలో ఆత్మాభిమాన రసాన్ని ఊరించలేదా? 'నేను బీదగా వున్నాను కాబట్టి, డబ్బుకోసం సన్మానాలు చేయించుకుంటా' అంటున్నావంటే, నీ వాదంలో, బీద గా వున్నందుకూ సన్మానమే; విద్వత్తు ఉన్నందుకూ సన్మానమే! చాలా తెలివైన దారి!
'ఒక్క ఎకరం వున్న తండ్రి గల వాణ్ణి కాబట్టే బీదరైతుల జీవితాల్ని బాగాచెప్పగలిగాను; ఐదెకరాల ఇంట్లో పుడితే అలాచెప్పలేకపోదును' అన్నావు. ఆ లెక్కన చూస్తే, ఇప్పుడు నువ్వు 10 లక్షల వాడివయ్యావు. ఇంకా అవుతావు కూడా. ఇక ఇప్పటి నించీ నువ్వు చెప్పగలిగే మంచి రసాల రచనలేవీ వుండవని అర్ధమేకదా? నీ వాదన ప్రకారమే, ఇక నామిని అస్తమించాడన్న మాటే కదా?
నామినీ, ఎందుకిలా నీ భుజాలు నువ్వు తడుముకుంటున్నావు? సంజాయిషీలతో మొదలుపెట్టి, దబాయింపుల్లోకి దిగిపోయావు. 'నేను ఇంత గొప్ప, అంత గొప్ప' అని మిడిసిపాటు ప్రదర్శించావు. బొత్తిగా, నిష్కారణంగా చాలా యాతన పడ్డావు.
కొంచెం వివేకం తెచ్చుకో! నీ సన్మానాల గురించి ఎవరైనా నిన్ను తప్పు పడితే, 'అందరూ చేసే పనే నేను చేశాను' నా కన్నా ముందు సన్మానాలు జరిగిన వాళ్ళందర్నీ తప్పు పట్టి, ఆ తర్వాత నన్ను తప్పు పట్టండి' అని చెప్పు, సరిపోతుంది. నువ్వు గతంలో ఎప్పుడైనా సన్మానాలకు వ్యతిరేకంగా మాట్లాడివుంటే, 'అప్పుడు బుద్ధి లేక అలా మాట్లాడాను. ఇప్పుడు బుద్ధి తెచ్చుకున్నాను' అని చెప్పు! అది ఇంకా సరిపోతుంది.
కులసంఘాల వాళ్ళ నించీ డబ్బు అందుకుని, 'వికారంగా కులసంఘా ల డబ్బు' అంటూ బడాయి మాటలు విసిరి, కులసంఘాల వాళ్ళకి ఒళ్ళు మండించకు! ఎందుకీ తుంటరి మాటలు? నీ విద్వత్తుకో, నీ బీదరికానికో, దేనికో దానికి నిన్ను స్థితిమంతుణ్ణి చేస్తోంటే, వాళ్ళకి వినయం చూపించు.
వాళ్ళకి అణగి మణిగి వుండు. చక్కగా వేద మంత్రాలతో, మంగళ వాయిద్యాలతో బాజా భజంత్రీలతో, వంది మాగధులతో ఎబికె ప్రసాద్ వంటి మహా మేధావుల ఆశీస్సులతో, బడా పారిశ్రామిక వేత్తల జ్యోతి ప్రజ్వలనాలతో, వందన సమర్పణలతో, రంగరంగ వైభవంగా సన్మానం చేయించుకో! ముచ్చటగా నెలకో సన్మానంతో నెలకో లక్ష అందుకో! ఎంతకాలం దాకా ఇస్తారో అంతకాలం దాకా అందుకో! వాళ్ళు ఇచ్చింది వాళ్ళ కష్టార్జితం కాదులే. వాళ్ళు దోచుకునే దాంట్లో నువ్వూ ఒక వాటా సంపాదించుకో.
నువ్వు ఇప్పుడు ఒక్క ఎకరం బీద రైతు కుమారుడివి కావు; బడా బడా పారిశ్రామికవేత్తల అత్యున్నత దేవస్థానం ప్రముఖుల ముద్దబిడ్డవి! ఇన్నా ళ్ళూ బీదరైతుల కథలు రాసిన నీ కలం నించి, ఇక ఇప్పటి నించి, సన్మానా లూ, ధనరాసులూ, ఎంత రుచికరమైనవో, నీ వంటి గొప్ప రచయితలకు అవి అందడం ఎంత న్యాయమో, ఎంత అభ్యుదయమో వర్ణిస్తూ నీ వాదనలతో రాబోయే నీ కొత్త రసాల రచన కోసం ఎదురు చూస్తాం నామినీ! సరేనా?
- రంగనాయకమ్మ