నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Showing posts with label సినిమానుభవం. Show all posts
Showing posts with label సినిమానుభవం. Show all posts

Sunday, August 14, 2011

వేలాది ‘ పూరో’ ల వేదన ఒక ‘ పింజర్’!


ముందస్తు హెచ్చరిక


ఇది ఈ ఆగస్ట్ 15 , స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షల పోస్ట్ కాదు . ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు జరిగిన రక్తపాతం, హింస, స్త్రీలపై జరిగిన అత్యాచారాలు గుర్తు చేసుకునే విషాద సందర్భం. మరో సారి ఆ పీడ కల ను ఒక సినిమా ద్వారా గుర్తు చేయాలనిపించింది. దేశ విభజన మీద కథలు, నవలలు, సినిమా లు అనేకం వచ్చాయి. వాటిల్లో నాకు బాగా నచ్చిన పుస్తకాలు రెండు. ఒకటి అమృతా ప్రీతం రాసిన నవల ' పింజర్'. రెండోది రీతూ మీనన్, కమలా భాసిన్ ల పరిశోధానాత్మక పుస్తకం ' బోర్డర్స్ అండ్ బౌండరీస్'. పింజర్ నవల 2003 లో సినిమా గా విడుదలయింది.
ముందుగానే మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఇది బటానీలో, పాప్ కార్నో నములుకుంటూ రిక్లైనర్ మీద కాళ్ళు జాపుకొని రిలాక్సెడ్ గా చూడగలిగే కాలక్షేపం సినిమా కాదు. మీకు కదిలిపోయే మనసుంటే, ఏడవగలిగే కన్నీళ్ళుంటేనే ఈ సినిమా చూడండి. పోనీ సినిమా చూడలేము అనుకుంటే ఈ సినిమా రెండు సార్లు చూసిన నా అనుభూతుల అనుభవాల్లోకి ఒకసారి వెళ్లాలనిపిస్తే ఇక్కడకు వెళ్ళి రండి.

 
Real Time Web Analytics